Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీలో రెండు కొత్త కోర్సులు

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:47 IST)
వచ్చే విద్యాసంవత్సరం డిగ్రీలో మరో రెండు కొత్త కోర్సులు రానున్నాయి. బీఎస్సీలో డేటాసైన్స్, బీకాంలో బిజినెస్​ అనలైటిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

ఉపాధినిచ్చే కోర్సులను ప్రవేశపెట్టేందుకు గత కొంతకాలంగా హయ్యర్ ఎడ్యుకేషన్​కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో డేటాసైన్స్ కోర్సు ఏర్పాటు కోసం కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి, వైస్​చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ రామచంద్రం, రిజిస్ర్టార్ గోపాల్​రెడ్డి, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీతో పాటు ఐఐఐటీ, టీసీఎస్, కాగ్నజెంట్ ప్రతినిధులతో కమిటీని వేశారు.

ఆ కమిటీ సమావేశమైంది. వచ్చే ఏడాది బీఎస్సీ డేటాసైన్స్​ను హానర్స్​కోర్సుగా తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సిలబస్, క్రెడిట్ పాయింట్లపైనా చర్చించారు. గురుకుల విద్యాసంస్థల్లో డేటాసైన్స్​ఆరునెలల కోర్సుగా కొనసాగిస్తున్నారు.

ఇది పూర్తిచేసిన వారిలో ఎక్కువమందికి మంచి కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి. దీంతో ఈ కోర్సును డిగ్రీలో పెట్టాలని ఉన్నత విద్యామండలికి గురుకులాల సెక్రటరీ గతంలో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఉన్నత విద్యామండలి కమిటీ వేసింది.

అలాగే బీకాంలోనూ బిజినెస్​ అనలైటిక్స్​కోర్సుపెట్టాలని మేనేజ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ కోర్సుపై కూడా చర్చ జరిగింది. ఇప్పటికే ఈ కోర్సు సిలబస్​ను అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండు కోర్సులను ప్రభుత్వ, అటానమస్​ కాలేజీల్లోనే ప్రారంభించాలని నిర్ణయించారు.

వీటితో పాటు అన్ని వసతులున్న ప్రైవేటు కాలేజీలు ముందుకొస్తే, వాటికి కూడా పర్మిషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయా కోర్సులు ప్రారంభించే కాలేజీల్లో సంబంధిత లెక్చరర్లకు ముందుగా ట్రైనింగ్​ ఇవ్వనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments