Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త చిక్కులో టిటిడి నూతన ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. కానీ?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (19:45 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన చిన్నాన్న వై.వి.సుబ్బారెడ్డిని టిటిడి ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఎపి సిఎం ప్రకటించారు. పాత బోర్డు ఉన్న నేపథ్యంలో ఆ బోర్డును రద్దు చేయడానికి కాస్త సమయం పట్టింది. కానీ అనుకోని రీతిలో అనూహ్యంగా సుబ్బారెడ్డికి టిటిడి ఛైర్మన్ పదవి లభించింది. 
 
తిరుమలకు చేరుకున్న వై.వి.సుబ్బారెడ్డి టిటిడి ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో టిటిడి ఛైర్మన్ చేత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే వై.వి.సుబ్బారెడ్డికి ఎప్పటివరకు ఆ పదవిలో ఉండనిస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. గతంలో అయితే కేవలం సంవత్సరం పాటు ఆ పదవిలో ఛైర్మన్‌ను నియమించేవారు.
 
ఆ తరువాత ఛైర్మన్, సభ్యులు బాగా పనిచేస్తే మరో సంవత్సరం పొడిగించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఉందా అన్నది అనుమానంగా మారుతోంది. రెండున్నర సంవత్సరాల పాటు నామినేటెడ్ పదవుల్లో అలాగే ఉండనిస్తానని, అవినీతి ఆరోపణలు వస్తే మాత్రం వెంటనే ఆ పదవి నుంచి తొలగిస్తానని జగన్ చెప్పారు.
 
దీంతో వై.వి.సుబ్బారెడ్డిని రెండున్నరేళ్ళ పాటు టిటిడి ఛైర్మన్‌గా కొనసాగిస్తారా లేకుంటే ఒక సంవత్సరం పాటు కొనసాగించి కొత్త వ్యక్తి మళ్ళీ టిటిడి ఛైర్మన్‌గా చేస్తారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు వై.వి.సుబ్బా రెడ్డి క్రిస్టియన్ అంటూ ప్రచారం ప్రారంభించారు. సామాజిక మాధ్యమాలే వేదికగా ఈ ప్రచారం జరుగుతోంది. దీంతో వై.వి.సుబ్బా రెడ్డికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఐతే ఇప్పటికే తను హిందువునన్న విషయాన్ని తన ఇంట్లో ఏ గోడను అడిగినా చెబుతుందని స్పష్టీకరించారి వైవీ. నమో వేంకటేశాయ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments