Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోపలేసి కుళ్లబొడిచి నట్లు బిగిస్తాం అంటూ తెలుగుదేశం నేతకు బెదిరింపులు

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (18:32 IST)
తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు పార్టీ మారిన గంటలోపే తనకు బెదిరింపులు మొదలయ్యాయని వాపోతున్నారు తెలుగుదేశం నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. 'సుజనా చౌదరి ఇంటి నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నాకు ఫోన్‌ చేసి బెదిరించారంటూ బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు. 
 
తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలపై అనవసర వ్యాఖ్యలు చేస్తే జైల్లో పెడతారని తనను భయానికి గురి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. పార్టీ మారిన ఎంపీలపై తాను విమర్శలు చేస్తున్న నేపథ్యంలో యార్లగడ్డ తనకు ఫోన్ చేసి విమర్శలు ఆపకపోతే  జైలులో పెడతారని, నట్లు బిగిస్తారని బెదిరించారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని తెలియజేశారు. 
 
ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు తనపై ఒక్క ఆరోపణ కూడా రాలేదని, అలాంటి తనను బెదిరించడం ప్రజాస్వామ్యంలో దిగజారిన చర్య అని అభిప్రాయపడ్డారు. తనకు ఫోన్లో కాల్ రికార్డు చేసే అలవాటు లేదని... లేదంటే యార్లగడ్డ బాగోతం సాక్ష్యాలతో సహా బయట పెట్టేవాడినని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments