Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీటీడీ పాలకమండలిని రద్దు.. టీటీడీ ఛైర్మన్‌గా జగన్ మేనమామ?

టీటీడీ పాలకమండలిని రద్దు.. టీటీడీ ఛైర్మన్‌గా జగన్ మేనమామ?
, ఆదివారం, 2 జూన్ 2019 (11:48 IST)
ఏపీలోని జగన్ ప్రభుత్వం టీటీడీ పాలకమండలిని రద్దు చేయడం అనివార్యమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. మూడు నాలుగు రోజుల్లో టీటీడీ నిబంధనల్లోని 135 ప్రకారం బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. 

దేవాదాయ శాఖ కమిషనర్ సిఫార్సు మేరకు ప్రభుత్వం నిర్ధిష్ట కారణాలపై టీటీడీ బోర్డును రద్దు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన ఫైలు కూడా సిద్ధమైందని సమాచారం. 
 
ఏపీలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. ఇక వైసీపీ ప్రభుత్వం రావడంతో... టీటీడీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేస్తారని అంతా అనుకున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా టీటీడీ పాలకమండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తుంటారు. 
 
కానీ పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం ఇందుకు నిరాకరించారు. అంతేకాదు టీటీడీ చైర్మన్ హోదాలో పాలకమండలి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

టీటీడీ ఈవో, జేఈవోతో పాటు పలువురు సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఈ సమావేశం అర్థాంతరంగా ముగిసింది. దీంతో టీటీడీ పాలకమండలిని రద్దు చేసే దిశగా జగన్ సర్కారు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
 
అంతేగాకుండా టీటీడీ ఛైర్మన్ పదవికి జగన్మోహన్ రెడ్డి మామయ్య ఎంపికవుతారని టాక్ వస్తోంది. వైఎస్ జగన్ మామగారు, మాజీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారావు టీటీడీ ఛైర్మన్ పదవికి ఎంపిక అవుతారని.. ఈ దిశగా జగన్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. వైవీ సుబ్బారావు.. జగన్ అమ్మగారైన విజయలక్ష్మికి సోదరుడు కావడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయసుధకు కీలక పదవి.. జగన్ పరిశీలన.. పోసాని, అలీకి ఏమిస్తారో?