ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (10:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఈ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుక, 30వ తేదీన ఉగాది పర్వదిన వేడుకలు జరుగనున్నాయి. దీంతో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. 
 
ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందుకు 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించడం జరగదని స్పష్టంచేసింది. తెంలగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23వ తేదీన స్వీకరించి 24వ తేదీన దర్శనానికి అనుమతించనున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments