Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Advertiesment
Devotees Fight in Tirumala

సెల్వి

, శుక్రవారం, 21 మార్చి 2025 (13:28 IST)
Devotees Fight in Tirumala
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. తన మనవడి పేరు మీద అన్నప్రసాద కేంద్రంలో అన్నదానం చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు పద్మావతి అతిథి గృహంలో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ సమావేశంలో టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ శ్యామల్ రావు, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 
భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాల రాజధానులలో వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించే ప్రణాళికను ఆయన ప్రకటించారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన హిందూ జనాభా ఉన్న ప్రదేశాలలో కూడా దేవాలయాలు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఆలయాల నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి, ఒక ప్రత్యేక ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేయబడుతుంది.
 
ఇదిలా ఉంటే, తిరుమల క్యూ లైన్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో గొడవ జరిగింది. 
 
తొలుత మాటల యుద్దం, అది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న గాజు సీసాతో మరో వ్యక్తి తల మీద కొట్టాడు. దీంతో తీవ్రగాయమైంది. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. గాయపడ్డ  వ్యక్తిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?