Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజిలెన్స్ అంచనాలు తప్పాయి .. అందుకే తొక్కిసలాట : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (13:01 IST)
ఇటీవలి తిరుమల కొండపై జరిగిన తొక్కిసలాటపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తితిదే విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై కింది స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
తిరుపతి ఎస్పీ గోశాలలో రూ.3 కోట్లతో నెయ్యి ఉత్పత్తి కేంద్రానికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల తొక్కిసలాటకు ప్రధాన కారణం విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తోపులాట జరిగిందన్నారు. దీంతో పరిస్థితిని సమీక్షించే వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
ఈ వేసవిలో శ్రీవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు తగినట్టుగా తాము భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో టైమ్ స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కంపార్టుమెంట్లలో భక్తులను ఉంచి విడతల వారీగా శ్రీవారి దర్శనానికి పంపుతామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments