Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజిలెన్స్ అంచనాలు తప్పాయి .. అందుకే తొక్కిసలాట : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (13:01 IST)
ఇటీవలి తిరుమల కొండపై జరిగిన తొక్కిసలాటపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తితిదే విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై కింది స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
తిరుపతి ఎస్పీ గోశాలలో రూ.3 కోట్లతో నెయ్యి ఉత్పత్తి కేంద్రానికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల తొక్కిసలాటకు ప్రధాన కారణం విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తోపులాట జరిగిందన్నారు. దీంతో పరిస్థితిని సమీక్షించే వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
ఈ వేసవిలో శ్రీవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు తగినట్టుగా తాము భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో టైమ్ స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కంపార్టుమెంట్లలో భక్తులను ఉంచి విడతల వారీగా శ్రీవారి దర్శనానికి పంపుతామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments