Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాహశీల్దారు హత్య కేసులో తెరాస ఎమ్మెల్యేల హస్తం!

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (13:53 IST)
హైదరాబాద్ నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో అధికార తెరాసకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 
 
విజయారెడ్డిని ఆమె పని చేసే తాహశీల్దారు కార్యాలయంలోనే సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. 
 
అయితే, విజయారెడ్డి మాట్లాడుతున్నట్టున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఆమె కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఓ మంత్రి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల పేర్లు ఇందులో ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సురేశ్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. సమస్యలు ఉన్నాయంటూ ఎంతో మంది ప్రతిరోజు తనను కలుస్తుంటారని తెలిపారు. విజయారెడ్డి హత్య దురదృష్టకరమని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments