Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవోపై వేటు.. కొత్తగా జేఎస్వీ ప్రసాద్ నియామకం?

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (13:29 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీ సర్కారు బదిలీ చేయనుంది. ఆయన స్థానంలో కొత్తగా సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను నియమించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను నేడో రేపో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, జేఎస్వీ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయన స్థానంలో ఇప్పటికే సతీశ్ చంద్రను ప్రభుత్వం నియమించి, ఉత్తర్వులు కూడా జారీచేసింది. 
 
దీంతో జేఎస్వీ ప్రసాద్‌కు తితిదే బోర్డు బాధ్యతలు అప్పగించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో జేఎస్వీ ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఎక్స్ ఆఫీషియో మెంబరుగా కూడా సేవలందించారు. ఇక అనిల్ కుమార్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయమై స్పష్టత రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments