ఏపీలో దిగజారిపోయిన సీఎం జగన్ పాలన : సినీ నటుడు పృథ్వీరాజ్

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (09:54 IST)
ఏపీలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా దిగజారిపోయి అధ్వాన్నంగా తయారైందని జనసేన పార్టీ నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా బృందం బోనకల్లును ఆదివారం సందర్శించింది. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఏపీలో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన తన ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. 
 
'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్ర గురించి ప్రశ్నించగా దర్శకుడు చెప్పిన పాత్రలో నటించాను తప్ప వేరే వాళ్ల గురించి తెలియదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బానోతు కొండ, గోంగూర శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
ఇదిలావుంటే, పృథ్వీరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా బృందం బోనకల్లులో ఆదివారం సందడి చేసింది. టీవీ ఆర్టిస్ట్‌ బానోత్‌ శ్రీనివాసరావు ఇంటికి అతిథులుగా వచ్చి విలేకరులతో మాట్లాడారు. కథానాయికగా తన కుమార్తె శ్రీ, హీరోగా తన మిత్రుడి కుమారుడు క్రాంతి నటించారని, చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని కోరారు. హీరో కాంతి, కథానాయిక శ్రీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments