Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లోక్‌సభ కాంగ్రెస్ కంచుకోట: తులసిరెడ్డి

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:22 IST)
తిరుపతి లోక్‌సభ కాంగ్రెస్ కంచుకోట అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయని...ఒకటి రెండు సార్లు కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు.

ప్రత్యేక హోదా విషయంలో వెంకటేశ్వర స్వామినే బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. బీజేపీ మోసగారి తనం వైసీపీ, టీడీపీల చేతగానితనం వల్ల ప్రత్యేక హోదా రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ వచ్చిందన్నారు.

దుగరాజపట్నం మేజర్ ఓడరేవు రాలేదని,  మన్నవరం ఫ్యాక్టరీ మూతబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ, టీడీపీలకు తిరుపతి లోక్‌సభ ఓటర్లను ఓటు అడిగే నైతిక హక్కు లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. 
 
తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి రంగంలోకి దిగనున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించినట్లు పవన్‌ వెల్లడించారు.

ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులతో పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని వారు గట్టిగా చెప్పారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments