Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీలు

Advertiesment
spinal surgeries
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:34 IST)
తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో ఇప్పటివరకు మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు చేస్తుండగా, త్వరలోనే వెన్నెముక ఆపరేషన్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇకపై బియ్యం, పింఛను కానుక కార్డుదారులందరికీ ఉచితంగా సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు ఉచితంగా చేయాలని, ఇంప్లాంట్స్‌కు మాత్రం రూ.65-రూ.70వేలు చెల్లించాలని నిర్ణయించారు. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి కొత్తగా డాక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపారు.

ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి అధునాతన పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. నూతన ఓపీడీ బ్లాక్‌లో నాల్గవ అంతస్తు నిర్మాణానికి రూ.3.5 కోట్లు మంజూరు చేశారు.

దేశంలోని నిపుణులైన ప్రముఖ వైద్యులందరినీ సంప్రదించి, వారికి వీలైన సమయంలో బర్డ్‌కు వచ్చి ఉచితంగా సర్జరీలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సర్జరీల వెయిటింగ్‌ సమయం తగ్గించడం కోసం కొత్తగా మూడు ఆపరేషన్‌ థియేటర్లను నిర్మించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసినవారిలో మొదటివాడు: చంద్రశేఖర ఆజాద్