Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల నేరాలు ఘోరాలు.. ట్రాక్టర్ బోల్తా.. వైకాపా కార్యకర్త చైన్ స్నాచింగ్ (video)

వరుణ్
ఆదివారం, 28 జులై 2024 (18:15 IST)
Bapatla
బాపట్లలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల కర్లపాలెం మండలం యాజలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 
 
శిగమట మండలం గట్టువారి పాలెం గ్రామానికి చెందిన కొండపాటూరు చెట్లు కోసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. యాజలి జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో గట్టు కోటేశ్వరరావు (65), గడ్డం శివనాగులు (60), గడ్డం లక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందారు. 
 
క్షతగాత్రులను 108 వాహనం ద్వారా బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తక్షణ వైద్యం నిమిత్తం తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు చైన్ స్నాచింగ్ కేసులో వైకాపా కార్యకర్తే బాపట్లలో బయటపడ్డారు. బాపట్లలో వైసిపి కార్యకర్త విజయ్ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దృశ్యం మీడియాలో వైరల్ అవుతోంది. వైకాపా కార్యకర్తగా వుండి రోడ్డుపై నిల్చున్న మహిళ వద్ద ఏదో మాట్లాడుతూ.. ఆమె చైన్‌ను లాక్కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments