Webdunia - Bharat's app for daily news and videos

Install App

సతీమణి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ భావోద్వేగానికి లోనైన మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి(Video)

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (18:41 IST)
స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడి సమాజం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు కొందరు మహానీయులు.. కాని నేటి సమాజంలో దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. వీటిలో మార్పు రావాలని ఆశిస్తున్నాం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి చేపట్టిన ఓ కార్యక్రమం అక్కడి వారి హృదయాలను కదిలించింది. 
 
తన అర్థాంగి పల్లె ఉమ ఇటీవల అనారోగ్యంతో కన్ను మూశారు. ఎన్నికల ముందు ఆమె మరణం ఆయన్ను బాగా కుంగదీసింది. ఆయన వేసిన ప్రతి అడుగులో ఆమె సహకారాన్ని పల్లె రఘునాథరెడ్డి మరవలేకపోయారు. అందుకే ఆమె నిత్యం తన ముందే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఏకంగా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 
 
రుద్రంపేటలోనే ఆయనకు సంబంధించి పివికెకె కళాశాలలో ఆమె విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఆయన నివాసం కూడా అక్కడే ఉండటంతో ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. పల్లె ఉమ తనకు జీవితంలో ఇచ్చిన సహకారం మరవలేనని.. అందుకే ఆమెను స్మరించుకుంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు రఘునాథరెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే పల్లె ఉమ ఫౌండేషన్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని.. ఇవి మరింత విస్తృతం చేస్తామని అంటున్నారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments