Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడిపై మోజు.. భర్తకు సుగంధి సోడాలో మత్తు మందు కలిపి?

ప్రియుడిపై మోజు.. భర్తకు సుగంధి సోడాలో మత్తు మందు కలిపి?
, శనివారం, 17 ఆగస్టు 2019 (15:33 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో, గుంటూరులో ప్రియుడి మోజులో భర్తను చంపేయాలనుకుంది ఓ భార్య. ప్రియుడిని అప్పుడప్పుడు కలుస్తుండిన భార్యను భర్త మందలించడంతో.. భర్తను చంపేయాలనుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామానికి చెందిన కొమ్మన బోయిన నాగరాజు(22)కి ఆరు నెలల కిందట కొల్లిపర మండలం పిడపర్రు పాలెంకు చెందిన గౌతమీ (19)తో పెళ్లైంది. 
 
అంతకుముందే వేరే వ్యక్తిని ప్రేమిస్తున్న గౌతమీ తీరు అనుమానాస్పదంగా మారింది. ప్రియుడితో ఆమె వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ సంభాషణలపై పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. తప్పైపోయిందని క్షమాపణ కోరింది. ఆ తర్వాత మళ్లీ మామూలే. 
 
రాఖీ పండుగ రోజున పుట్టింటికి భర్తలో వెళ్లిన ఆమె  సుగంధి సోడాలో మత్తు మందు కలిపి భర్తకు ఇచ్చింది. దీంతో అనారోగ్యానికి గురైన నాగరాజు గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

48 రోజుల కంచి వరదుడి దర్శనం పరిసమాప్తం... తిరిగి జలగర్భంలోకి, ఇక 2059లోనే దర్శనం