Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్ళయి నెలరోజులు.. భార్యను పుట్టింట్లో వదిలి ప్రియురాలితో ఎంజాయ్.. చివరికి?

పెళ్ళయి నెలరోజులు.. భార్యను పుట్టింట్లో వదిలి ప్రియురాలితో ఎంజాయ్.. చివరికి?
, శనివారం, 17 ఆగస్టు 2019 (18:21 IST)
సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం. లక్షల రూపాయల జీతం. ఇంకేముంది అబ్బాయి మంచోడని నమ్మి కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేశారు తల్లిదండ్రులు. కానీ ఆ ఆశ మొత్తం నెలరోజుల్లోనే ఆవిరైపోయింది. కుమార్తెను అల్లుడు మోసం చేయడమే కాకుండా తను నిలువుగా పోసపోయి చివరకు ప్రాణాలను కోల్పోయాడు. 
 
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఏరియా అది. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు. అమెరికా బేస్డ్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. జనగాంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు రాంకుమార్. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. సంవత్సరం నుంచి ఇక్కడే ఉద్యోగం. 
 
మంచి జీతం వస్తుండటంతో జనగాంకు చెందిన రాజేష్ తన కుమార్తె రేవతిని ఇచ్చి వివాహం చేశారు. నెల రోజులైంది వివాహమై. అయితే ఉద్యోగరీత్యా ఆమెను తన పుట్టింట్లోనే ఉంచి హైదరాబాద్‌కు వచ్చేశాడు రాంకుమార్. అయితే ఇక్కడే అతని జీవితం పూర్తిగా మలుపు తిరిగి పోయింది.
 
తనతో పాటు పనిచేసే యువతి రాంకుమార్‌కు ప్రేమ పేరుతో దగ్గరైంది. వారంరోజుల పాటు రాంకుమార్‌కు శారీరకంగా దగ్గరైంది. దీంతో ఆమెను నమ్మాడు రాంకుమార్. అంతేకాదు ఆమె అడిగిన దాన్ని కొనిచ్చాడు. తనపై జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్‌ను ఆమెకు రాసిచ్చేశాడు. అయితే ఆ తరువాత ఆమె నిజస్వరూపం తెలిసింది. ఆ యువతి యువకులను ప్రేమ పేరుతో మోసం చేసి ఆస్తి రాసుకుంటుందని తెలుసుకున్నాడు. కుమిలిపోయాడు. ఎవరికీ చెప్పకుండా జనగాంకు వెళ్ళి భార్య ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. మాయలేడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాంకుమార్ భార్య మాత్రం పెళ్లయిన నెలరోజులకే దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గల్లీ అబ్బాయి ''జొమాటో''ను ఎలా వాడుకున్నాడో తెలుసా?