Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంకు పెట్టెలో కరెన్సీ నోట్లు.. ఐదు లక్షలు చెదల పాలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:59 IST)
ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త బ్యాంకు కంటే తన ఇంట్లోని ట్రంకు పెట్టే సేఫ్ అనుకున్నాడు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఆ పెట్టెలో పెట్టాడు. కట్టల కొద్దీ డబ్బు. రూ.500, 200, 100 నోట్ల కట్టలు. కానీ ఆ డబ్బు కాస్తా చివరికి చెదల పాలైంది. 
 
ఏకంగా రూ.5 లక్షల్ని చెదలు తినేశాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని మైలవరంలో ఉన్న బిజిలీ జమాలయ్య ఇంట్లో చోటుచేసుకుంది. పందుల వ్యాపారం చేసే అతడు.. నగదు రూపంలోనే వ్యాపారం చేస్తాడు. ఇందులో వచ్చే డబ్బు మొత్తాన్నీ బ్యాంకులో వేసే బదులు ఇంట్లోని ట్రంకు పెట్టెలోనే పెట్టేవాడు. 
 
బాగా డబ్బు జమ చేసి ఇల్లు కట్టుకోవాలన్నది జమాలయ్య కల. దీనికోసం ఇప్పటికే రూ.5 లక్షలు జమ చేశాడు. తాను చెమటోడ్చి సంపాదించిన డబ్బంతా చెదల పాలవడం చూసి తెగ బాధపడిన అతడు.. ఆ మిగిలిన కరెన్సీ ముక్కలను చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచి పెట్టడం విశేషం. పిల్లల చేతుల్లో పెద్ద పెద్ద నోట్లు కనిపించే సరికి పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments