Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిడుగు రామమూర్తి జయంతి : త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (10:31 IST)
గిడుగు రామమూర్తి జయంతి వేడుకలను తెలుగు భాషా దినోత్సవంగా తెలుగు రాష్ట్రాలు జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
 
గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఏఎన్‌యూలో 13 మంది భాషా పండితులకు ఆయన గిడుగు రామమూర్తి పురస్కారాలను అందజేశారు. అనంతరం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగును ఖచ్చితంగా బోధించాలని స్పష్టం చేశారు. 
 
తెలుగుకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు, డిగ్రీలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. తెలుగు గొప్పతనాన్ని ఖండాంతరాలకు వ్యాప్తి చేసేందుకు తాము ఎన్‌ఆర్ఐల సహకారం తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments