Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో తెలుగు భాషా అధ్యయన కేంద్రం

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (18:18 IST)
నెల్లూరులో తెలుగు భాషా అధ్యయన కేంద్రం ఖరారైందని తెలుగు భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
 తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..

"ఈరోజు తెలుగు జాతి మొత్తం గర్వించదగిన రోజు. తెలుగు భాషను రాజ భాషగా వైయస్ నాడు ప్రకటించారు. తెలుగు భాషా అధ్యయన కేంద్రం ఎపికి కావాలని కోరాం. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు హయాంలో అధ్యయన కేంద్రం పై నిర్లక్ష్యం వహించారు. జగన్ సిఎం అయ్యాక తెలుగు భాషా అధ్యయన కేంద్రం తీసుకురావాలని నిర్ణయించారు.

తెలుగు భాషా సంఘం అధ్యక్షు హోదాలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిశాను. తిక్కన నడయాడిన నేల నెల్లూరుకు అధ్యయన కేంద్రంను తీసుకుని రావాలని కోరాం. ఎనిమిది యేళ్ల కల ఇంత కాలానికి నెరవేరడం ఆనందంగా ఉంది. సిఎం జగన్ చొరవతో నేను చేసిన ప్రయత్నం ఫలించింది.

తెలుగు భాషా అధ్యయన కేంద్రం తెలుగు నేలలో ఉండేలా చేసిన వెంకయ్య నాయుడికి పాదాభివందనం. మైసూరులో ఉన్న కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది. ఇది తెలుగు ప్రజలందరూ గర్వించదగిన అంశం.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు బోధించాలి. ఈ అంశాన్ని సిఎం జగన్ కు వివరించా. ఆయన సానుకూలంగా స్పందించారు" అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments