Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ వీడ్కోలు... ఉద్వేగానికి లోనైన దంపతులు

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (18:09 IST)
తెలుగు రాష్ట్ర మాజీ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శనివారం వీడ్కోలు పలికారు. ఆదివారం అంటే... సెప్టెంబర్ 8న తెలంగాణ కొత్త గవర్నర్‌గా తమిళైసాయి సౌందరాజన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో నరసింహన్‌కు వీడ్కోలు ఏర్పాటు చేశారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో గవర్నర్ దంపతులకు సిఎం కెసిఆర్, మంత్రులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, ఇతర అధికారులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా గవర్నర్ దంపతులను కెసిఆర్ ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ విడిచి వెళ్తున్నందుకు గవర్నర్ దంపతులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అందరికీ వీడ్కోలు చెప్పిన గవర్నర్ దంపతులు 4 గంటలకు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు వీడ్కోలు చెప్పారు.
 
కాగా తన శేష జీవితాన్ని చెన్నై నగరంలో గడుపుతానని ఇప్పటికే నరసింహన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తొమ్మిదన్నర ఏళ్లపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments