Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేయ్... నా.. కొ.. కా... మరదలిని పెళ్లి చేసుకున్న భర్తకు భార్య బడిత పూజ

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (09:27 IST)
తొలి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్తకు ఓ భార్య బడిత పూజ చేసింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఆ ప్రబుద్ధుడిని ఉతికి ఆరేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన సాంబశివరావుకు నాలుగేళ్ల క్రితం శైలజ అనే మహిళతో వివాహమైంది. ఆమెకు పిల్లలు పుట్టలేదు. దీంతో ఆమెను మానసికంగా వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేని శైలజ.. భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లింది .
 
ఇదే అదునుగా భావించిన సాంబశివరావు భార్యకు తెలియకుండా మరదలి వరుస అయ్యే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శైలజ ఆగ్రహంతో రగిలిపోయింది. తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకూ అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది.
 
అంతేనా, విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త పట్టుకుని ఉతికి ఆరేసింది. రెండో భార్యతో ఏకాంతంగా భర్త ఉన్నపుడు ఇంటిపై దాడి చేసి ఆయన్ను పట్టుకుంది. ఆ తర్వాత భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి పట్టుకుని చావబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సాంబశివరావును రక్షించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments