Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి స్త్రీతో భర్త వివాహేతర లింకు.. భార్య సూసైడ్...

కట్టుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేసి పరాయి స్త్రీతో పలుకుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది.

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (09:36 IST)
కట్టుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేసి పరాయి స్త్రీతో పలుకుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన అనగాని రంజిత్‌కుమార్‌తో రజిని (27) అనే మహిళకు 11 యేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. 
 
అయితే, గత కొంతకాలంగా మరో మహిళతో తన భర్త రంజిత్ కుమార్ వివాహేతర సంబంధం నడుపుతున్న విషయాన్ని రజిని కనిపెట్టింది. దీంతో భర్త వైపు నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. రంజిత్‌ కుమార్‌కు అతని తల్లి నాగమణి సహకరించడంతో ఈ వేధింపులను రజినీ తట్టుకోలేక పోయింది. 
 
ఈ క్రమంలో ఇటీవల రజిని గొల్లగూడెంలోని పుట్టింటికి వెళ్లింది. మూడో తేదీన ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన రజినిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ మృతి చెందింది. 
 
రజిని తండ్రి గుండ్ల చిన నరసింహ ఫిర్యాదు మేరకు తల్లాడ ఎస్సై బి.తిరుపతిరెడ్డి కేసు నమోదు చేసి, శవపరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని నారాయణపురం తీసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments