Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓర్నీ... ఆంధ్రోళ్లను అరెస్టు చేస్తారా? ఏంది?

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (12:25 IST)
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా సమావేశయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో పాటు.. కీలక అధికారులు, సలహాదారులు కూడా హాజరయ్యారు. 
 
ఈ సమావేశం ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. దాదాపు సమావేశం ముగింపు దశకు వచ్చేసరికి 'అధికారుల తదుపరి భేటీ ఎప్పుడు?' అంటూ తమ సీఎస్‌ జోషీని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. దీనిపై జోషి స్పందిస్తూ 'వెంటనే భేటీ అవుతాం సార్‌... ఎందుకంటే ఈ ఆంధ్రావాళ్లు (అధికారులు) వెళితే మళ్లీ దొరకరు' అంటూ సరదాగా అన్నారు.
 
దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ, 'ఓర్నీ...ఆంధ్రోళ్లను అరెస్టు చేస్తారా? ఏంది?' అంటూ నవ్వుతూ అనడంతో, 'అవసరం అయితే అరెస్టు చేయడమే' అంటూ జోషి చమర్కరించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. ఈ సందర్భంలో ఏపీ సీఎం జగన్‌ జోక్యం చేసుకుని 'మంచి కోసం అరెస్టు చేసినా ఫర్వాలేదు' అంటూ కౌంటర్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments