Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో తెదేపాకు షాక్ : గోడదూకనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:52 IST)
తెలుగుదేశం పార్టీకి విశాఖపట్టణం జిల్లాలో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికార వైకాపాలో చేరనున్నారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 
 
విశాఖపట్టణాన్ని రాజధానిగా టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే తెలుగుదేశానికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
కాగా, ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా వైకాపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిజానికి ఈయన ఆగస్టు 16వ తేదీనే వైకాపాలో చేరాల్సివుంది. 
 
కానీ, ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు.. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌లు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో గంటా అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైకాపాలో చేరనుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments