Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాలర్‌ శేషాద్రి మృతి త‌ర‌ని లోటు... ధ‌న్య‌జీవి: చంద్రబాబు, వైవీ సుబ్బారెడ్డి

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (11:14 IST)
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శేషాద్రి మృతి టీటీడీకి తీరని లోటని చెప్పారు. ఆయన నిత్యం వేంకటేశ్వరస్వామి సేవలో తరించేవారని, టీటీడీకి విశేష సేవలు అందించారన్నారు. డాలర్‌ శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
 
 
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న ఆయన మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. శ్రీవారి సేవే ఊపిరిగా శేషాద్రి పని చేశారని, జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి శేషాద్రి అని సుబ్బారెడ్డి అన్నారు. అందరితో ప్రేమగా ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారని చెప్పారు. శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments