Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డమైన పనులు చేసి చిప్పకూడు తిన్నది ఎవరో తెలుసు : బుద్ధా వెంకన్న

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (15:09 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా ప్రజాప్రతినిధులపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా మరోమారు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విమర్శలు చేశారు. అడ్డమైన పనులు చేసి 16 నెలల పాటు చిప్పకూడు తిన్నది ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. 
 
ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారని, టీడీపీ నేతల రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయంటూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 
 
'వైఎస్ జగన్‌గారు, మీరు కలిసి మొదలుపెట్టిన మూడు రాజధానుల దందా వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలిసి అధికారులు పారిపోతున్నారు. ముందు వారిని ఆపే మార్గం చూడండి విజయసాయిరెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న సూచించారు. 
 
అంతేకాకుండా, 'అడ్డమైన పనులు చేసి 16 నెలలు చిప్పకూడు తిన్న నీకు మా రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి అనే అంత ధైర్యం వచ్చిందా? అంతవరకూ వచ్చాకా మేము మాత్రం చూస్తూ కూర్చుంటామా? మిమల్ని, మీ జగన్‌గారిని మళ్లీ జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రెడీగా ఉండండి' అని ట్వీట్ చేశారు.
 
'పాత తప్పులు, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో వైజాగ్‌లో చేస్తున్న భూముల దందా అంతా బయటపడుతుంది మీరు, మీ పరివారం ఊచలు లెక్కపెట్టడం ఖాయం సాయి రెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments