Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాలంటే టెస్ట్ మ్యాచ్ .. ఓర్పు - సహనం ముఖ్యం...

రాజకీయాలంటే టెస్ట్ మ్యాచ్ .. ఓర్పు - సహనం ముఖ్యం...
, శుక్రవారం, 31 జనవరి 2020 (11:28 IST)
జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలకడలేని మనస్తత్వం కారణంగా రాజీనామా చేస్తున్నట్టు లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ తగిన రీతిలో కౌంటర్ ఇచ్చారు. తనకు సినిమాలు చేయడం తప్ప మరో పని తెలియదని, పైగా, తనపై ఆధారపడి అనేక కుటుంబాలు ఉన్నాయని గుర్తుచేశారు. 
 
ఇదిలావుంటే, లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ కీలక కామెంట్స్ చేశారు. 'రాజకీయాలంటే 20-20 మ్యాచ్ కాదు. టెస్ట్ మ్యాచ్. ఓర్పు, సహనం, నిరీక్షణ ఉండాలి. నాయకుడంటే ఓడిపోగానే వదిలి వెళ్లిపోవడం కాదు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వంతో పాటు బీ ఫార్మ్ తీసుకున్నారు. ఓడిపోగానే తెల్లకాగితాల మీద రాజీనామాలు చేస్తున్నారు. నిలకడ అంటే ఇదేనా?' అని ప్రశ్నించారు. 
 
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టారు. 'రాజకీయాల్లో ఉంటూ వేల కోట్ల రూపాయలను వ్యాపారాల ద్వారా సంపాదిస్తున్న వారిని ప్రశ్నించడం చేతకావడం లేదు. ఆర్థిక నేరగాళ్లు దర్జాగా తిరుగుతుంటే, సిద్ధాంతాల మీద నిలబడిన వ్యక్తులకి నేడు కాకపోతే రేపైనా ప్రజలు అండగా నిలబడతారు' అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివ - కీర్తి హ్యాపీగా ఉండండి... అయినా ఇలా చేస్తున్నందుకు ఫీల్ అవ్వండి...