Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను విన్నాను... నేను ఉన్నాను అంటే... గుర్తుకువచ్చేది.. బుద్ధా వెంకన్న సెటైర్లు

నేను విన్నాను... నేను ఉన్నాను అంటే... గుర్తుకువచ్చేది.. బుద్ధా వెంకన్న సెటైర్లు
, గురువారం, 30 జనవరి 2020 (17:15 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఆయన కుడిభుజంగా ఉన్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తనదైనశైలిలో సెటైర్లు వేశారు. 'నేను విన్నాను, నేను ఉన్నాను' అనగానే సీఎం జగనే గుర్తుకువస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న స్పందించారు. 
 
'నేను విన్నాను, నేను ఉన్నాను' అంటే గుర్తుకు వచ్చేది సీఎం జగన్ కాదు విజయసాయిరెడ్డిగారూ, అధికార దాహంతో ఆయన అడ్డగోలుగా ఇచ్చిన హామీలు, అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజల్ని మోసం చేసిన తీరే గుర్తుకువస్తుంది అంటూ ఘాటుగా విమర్శించారు.
 
ముఖ్యంగా, 'ఒక్కసారి గ్రామాల్లో తిరగమనండి... మేము ఉన్నాము, బడితెపూజ చేస్తాము అంటూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్‌ను గ్రామాల్లోకి పంపితే ఎవరి ఇమేజ్ ఏంటో అప్పుడర్థమవుతుంది' అని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, 'మీరు, జగన్ పత్రికా విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది విజయసాయిరెడ్డి గారూ! తెలుగువారి మనస్సాక్షి సాక్షి పేపర్ అంటూ జగన్ గారు ఘోరమైన స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మీ బుద్ధి ఏమైంది? నిత్యం మీ బ్రోకర్ పనులకు మడుగులు ఒత్తే చెత్త పేపర్‌ను, చానల్‌ను తెలుగువారి మనస్సాక్షి అంటూ బిల్డప్ ఇచ్చినప్పుడు ధార్మికతను ఆపాదించినట్టు అనిపించలేదా?' అంటూ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర బడ్జెట్ 2020: గత ఏడాది హామీల సంగతేమిటి? ఈసారి బడ్జెట్ నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు?