Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ను కలుస్తానంటున్న బాలకృష్ణ.. ఎందుకబ్బా?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని సినీ నటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ ప్రకటన టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. అయితే, ఆయన సీఎం జగన్‌ను కలవడానికి ప్రధాన కారణం లేకపోలేదు. 
 
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై అవసరం అయితే సీఎంను కలుస్తానని ప్రకటించారు. 
 
ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, స్థానిక వైకాపా నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారని గుర్తుచేశారు. 
 
ఇంటి పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంద న్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments