Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రమేష్ చేతిలో బీజేపీ అభ్యర్థి చిత్తు... కాంగ్రెస్ - వైకాపా మద్దతుతో విజయం

కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తేరుకోలేని షాకిచ్చారు. పార్లమెంటులో ప్రతిష్టాత్మకమైన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుల ఎన్నికల్లో ఆయన బీజేప

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:06 IST)
కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తేరుకోలేని షాకిచ్చారు. పార్లమెంటులో ప్రతిష్టాత్మకమైన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుల ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిపై విజయభేరీ మోగించారు. ఈ ఎన్నికల్లో విపక్ష పార్టీలన్నీ కలిసి సీఎం రమేష్‌కు ఓట్లేసి గెలిపించాయి. దీంతో ఆయన రికార్డు స్థాయిలో విజయం సాధించాడు.
 
నిజానికి టీడీపీకి రాజ్యసభలో కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. కానీ విపక్ష పార్టీలన్నీ ఏకం కావడంతో రమేష్‌కు 106 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌, వైసీపీ కూడా రమేశ్‌కే మద్దతు పలకడం విశేషం. ఇక విశ్వాసపరీక్షలో నరేంద్ర మోడీ సర్కారుకు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే కూడా ఝలక్‌ ఇచ్చింది. మొత్తం 13 మంది సభ్యులూ రమేశ్‌కే ఓటేయడం గమనార్హం. అలాగే, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఓటింగ్‌లో పాల్గొని సీఎం రమేష్‌కు ఓటు వేయడం గమనార్హం. 
 
పార్లమెంటు పీఏసీకి చెందిన రెండు సీట్లకు సోమవారం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, వామపక్షాలు, టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేడీకి చెందిన ఎంపీలందరూ రమేశ్‌కు అండగా నిలబడటంతో అత్యధిక ఓట్లతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భూపేంద్ర యాదవ్‌కు 69 ఓట్లే లభించాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన జేడీయూ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు కేవలం 26 ఓట్లు రావడంతో ఆయన ఘోరంగా ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments