Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తేలనున్న తెదేపా మాజీ మంత్రి గంటా భవితవ్యం

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:51 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఆయనకు పార్టీ అధినేత నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఇన్‌ఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలకు ఈ కబురు వెళ్లింది. శుక్రవారం జరిగే కీలక భేటీలో మొత్తం 12 మందికి ఆహ్వానం వెళ్లింది. 
 
కబురు పంపిన వారిలో సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు కూడా ఉన్నారు. నిజానికి ఈయన గత 2019 ఎన్నికల తర్వాత పార్టీలో క్రియాశీలకంగా లేరు. ఒకసారి వైకాపాలో మరోమారు బీజేపీలో చేరబోతున్నట్టు ముమ్మరంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని ఆయన ఏ రోజూ ఖండించకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
ఆ తర్వాత విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించే సమావేశానికి గంటాతో పాటు 12 మందిని ఆహ్వానించారు. ఈ సమావేశానికి గంటా వస్తారా? లేదా? అన్నది తేలిపోతుంది. ఒకవేళ వస్తే ఆయన టీడీపీలోనే కొనసాగే అవకాశం వుంది. లేనిపక్షంలో ఆయన పార్టీ మారడం ఖాయమని తేలిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments