Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తేలనున్న తెదేపా మాజీ మంత్రి గంటా భవితవ్యం

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:51 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఆయనకు పార్టీ అధినేత నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఇన్‌ఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలకు ఈ కబురు వెళ్లింది. శుక్రవారం జరిగే కీలక భేటీలో మొత్తం 12 మందికి ఆహ్వానం వెళ్లింది. 
 
కబురు పంపిన వారిలో సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు కూడా ఉన్నారు. నిజానికి ఈయన గత 2019 ఎన్నికల తర్వాత పార్టీలో క్రియాశీలకంగా లేరు. ఒకసారి వైకాపాలో మరోమారు బీజేపీలో చేరబోతున్నట్టు ముమ్మరంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని ఆయన ఏ రోజూ ఖండించకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
ఆ తర్వాత విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించే సమావేశానికి గంటాతో పాటు 12 మందిని ఆహ్వానించారు. ఈ సమావేశానికి గంటా వస్తారా? లేదా? అన్నది తేలిపోతుంది. ఒకవేళ వస్తే ఆయన టీడీపీలోనే కొనసాగే అవకాశం వుంది. లేనిపక్షంలో ఆయన పార్టీ మారడం ఖాయమని తేలిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments