Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులను ఆదుకోవాలంటూ సమీర్ శర్మకు బాబు లేఖ

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకోవాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఓ లేఖ రాశారు. అలాగే, వరదల్లో ప్రభుత్వం వైఫల్యంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
ఈ మేరకు సీఎస్‌కు చంద్రబాబు రాసిన లేఖలో ప్రభుత్వం అంచనాల మేరకు వరద నష్టం రూ.6,054 కోట్లు వాటిల్లితే కేవలం రూ.35 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకోవడం సరైన విధానం కాదన్నారు. 
 
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ఖర్చు చేయాల్సిన రూ.1100 కోట్లను ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించడంపై కాగ్ కూడా తీవ్రంగా తప్పుబట్టిందని గుర్తుచేశారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. 
 
ముఖ్యంగా, తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చడంతో తిరుపతి పట్టణం వరదలు ముంచెత్తాయని, వరదల్లో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. 
 
ముఖ్యంగా, కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లిందన్నారు. రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిందన్నారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments