Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్మాదంతో దాడులు చేస్తున్న వైకాపా నేతలు : చంద్రబాబు

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:06 IST)
వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వైకాపా నేతలు ఉన్మాదంతో రెచ్చిపోతు దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. జర్నలిస్టులు, అధికారులపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. 
 
ఆయన మంగళవారం మాట్లాడుతూ, ఇది నేరస్థుల ప్రభుత్వమన్నారు. అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ మారకపోతే దాడులు చేస్తామంటూ వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
 
వైసీపీ దాడులతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. 'నేను మీలాగే వ్యవహరిస్తే వైసీపీ నేతలు ఎక్కడ ఉండేవారు?. దొంగసారా, బెట్టింగ్‌ కాసే వాళ్ళు ఎమ్మెల్యేలా?' అంటూ నిలదీశారు. 
 
కేసుల పేరుతో మహిళలను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేకు పిచ్చి పట్టింది.. మహిళల జోలికొస్తే తాట తీస్తానని తీవ్రంగా హెచ్చరించారు. జగన్ జేఎస్టీని తలపిస్తూ లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ టాక్స్‌కు తెరతీస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments