Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ అధినేత చంద్రబాబుకు పులివర్తి నాని సాదర స్వాగతం

Advertiesment
Chandrababu Naidu
, సోమవారం, 14 అక్టోబరు 2019 (20:59 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని సాదర స్వాగతం పలికారు. సోమవారం ఉదయం 8 గంటలకు నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా నెల్లూరు బయలుదేరి వెళ్ళారు. 
 
ప్రతిపక్ష నేతగా, నెల్లూరులో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు రావటంతో భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. పులివర్తి నానితో పాటుగా మాజీ మంత్రి అమరనాథరెడ్డి పార్టీ ముఖ్య నాయకులు బాబుకు పుష్ప గుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. అలాగే త్వరలో జరిగే చిత్తూరు జిల్లా పర్యటనపై పార్టీ ముఖ్య నాయకులను ఆరా తీశారు.
 
తెలంగాణ సీఎం కార్యాలయం హెల్ప్ లైనుకు ఎవరో ఫోన్ చేసినట్లు, తమ అభిప్రాయాలు చెప్పినట్లు రెండు రోజులుగా పత్రికల్లో, ఛానళ్లలో తప్పుడు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే విధంగా దుష్ప్రచారం జరుగుతున్నది. సీఎం కార్యాలయ సిబ్బంది మాట్లడినట్లు ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం..?