Webdunia - Bharat's app for daily news and videos

Install App

కందుకూరు తొక్కిసలాట.. టీడీపీ రూ.24 లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (22:13 IST)
కందుకూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.24 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బుధవారం రాత్రి కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన ఎనిమిది మంది వ్యక్తుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.24 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది టీడీపీ. 
 
మృతుల కుటుంబాలకు తొలుత రూ.10 లక్షలు ప్రకటించిన టీడీపీ.. గురువారం అదే రూ.15 లక్షలకు పెంచింది. మృతుల బంధువులకు 11మంది నేతలు మరో రూ.9 లక్షలు ప్రకటించారు.
 
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో బుధవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్ష నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ముందుకు వచ్చి కాలువలో పడిపోవడంతో జరిగిన ఈ విషాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments