Webdunia - Bharat's app for daily news and videos

Install App

కందుకూరు తొక్కిసలాట.. టీడీపీ రూ.24 లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (22:13 IST)
కందుకూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.24 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బుధవారం రాత్రి కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన ఎనిమిది మంది వ్యక్తుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.24 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది టీడీపీ. 
 
మృతుల కుటుంబాలకు తొలుత రూ.10 లక్షలు ప్రకటించిన టీడీపీ.. గురువారం అదే రూ.15 లక్షలకు పెంచింది. మృతుల బంధువులకు 11మంది నేతలు మరో రూ.9 లక్షలు ప్రకటించారు.
 
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో బుధవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్ష నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ముందుకు వచ్చి కాలువలో పడిపోవడంతో జరిగిన ఈ విషాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments