Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు విద్యార్థుల మృతి

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (08:45 IST)
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద ఘోరం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ నుంచి చిలకలూరు పేటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలిలోనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. 
 
విజయవాడలోని ఓ కాలేజీలో ఆర్కిటెక్చర్ విద్యాభ్యాసం చేస్తున్న గౌతమ్ రెడ్డి (విజయవాడ), చైతన్య, పవన్ (కాకినాడ), సౌమ్యిక (విశాఖ)లు ఓ కారులో చిలకలూరిపేటకు బయలుదేరారు. ఈ కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. కారు వేగంగా వస్తుండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments