Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు విద్యార్థుల మృతి

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (08:45 IST)
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద ఘోరం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ నుంచి చిలకలూరు పేటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలిలోనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. 
 
విజయవాడలోని ఓ కాలేజీలో ఆర్కిటెక్చర్ విద్యాభ్యాసం చేస్తున్న గౌతమ్ రెడ్డి (విజయవాడ), చైతన్య, పవన్ (కాకినాడ), సౌమ్యిక (విశాఖ)లు ఓ కారులో చిలకలూరిపేటకు బయలుదేరారు. ఈ కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. కారు వేగంగా వస్తుండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments