Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్‌పై చేతులెత్తేసిన జగన్ సర్కారు.. అసెంబ్లీ చర్చ!

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:30 IST)
తన సొంత జిల్లా కడపలో నెలకొల్పతలపెట్టిన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది. దీనికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ప్లాంట్ ఏర్పాటు చేయకపోవడానికి కరోనా మహమ్మారి అంటూ సెలవిచ్చారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టీడీపీ లేవనెత్తిన ప్రశ్నపై అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్ళవుతున్నా ఇంతవరకు కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. సొంత జిల్లాలోని ప్లాంట్ నిర్మాణాన్ని కూడా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. 
 
దీనికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కరోనా వల్ల ప్రపంచమే కుదేలైందని, స్టీల్ పరిశ్రమ పూర్తిగా డౌన్ అయిందన్నారు. కరోనాతో రెండేళ్లు గడిచిపోయాయని చెప్పారు. ఈ విషయాలు తెలుసుకోకుండా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments