Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో లిక్కర్ స్కామ్ : నెల్లూరులో ఈడీ సోదాలు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:22 IST)
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను మద్యం కుంభకోణం కుదిపేసింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుపుతుంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు పలువురు ఇళ్లలో సోదాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన హైదరాబాద్, నెల్లూరులతో పాటు ఏకంగా 40 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 
 
ఒక్క హైదరాబాద్ నగరంలోనే 20కు పైగా ప్రాంతాల్లోను, ఏపీలోని నెల్లూరు, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో మరో 20 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ బిజినెస్ వ్యాపారులు, డిస్టిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్‌వర్క్‌ను ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. 
 
కాగా, ఈ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు సోదాలు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతవారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. అపుడు ఏపీలో సోదాలు నిర్వహించని ఈడీ అధికారులు రెండో దఫాలో మాత్రం ఈ తనిఖీలు చేస్తుండటం గమనార్హం. కాగా, ఈ కేసును సీబీఐ కూడా విచారిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments