సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాదం ... సూత్రధారులను గుర్తిస్తాం : జిల్లా ఎస్పీ

వరుణ్
గురువారం, 25 జులై 2024 (08:57 IST)
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన వెనుక ఉన్న సూత్రధారులను గుర్తిస్తామని, ఆ దిశగానే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. సబ్ కలెక్టరేట్‌లో జరిగిన ఘటనలో 25 అంశాలకు చెందిన రెవెన్యూ పత్రాలు దగ్ధమయ్యాయని తెలిపారు. పాక్షికంగా కాలిన 700 పత్రాలను రికవరీ చేయగలిగామన్నారు. 
 
నిపుణులను పిలిపించి సంఘటన స్థలం నుంచి నమూనాలు సేకరించామని ఎస్పీ విద్యాసాగర్ వివరించారు. నిపుణుల నివేదికలు వచ్చాక మరిన్ని ఆధారాలు బయటికి వస్తాయని అన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనలో అధికారులు, ఇతరుల పాత్రపైనా విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. కాగా, కార్యాలయంలో ఘటన జరగడానికి ముందే అక్కడ ఇంజిన్ ఆయిల్ ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. ఈ వ్యవహారంలో 35 మంది అనుమానితులను గుర్తించి విచారిస్తున్నామని తెలిపారు.
 
ఈ ఘటనలో అసలు కుట్రదారులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారని, అనుమానితుల ఫోన్ కాల్ డేటా, సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ రికార్డుల పరిశీలన జరుగుతోందని చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments