Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్ టీచరుతో మైనర్ బాలుడు ప్రేమ... ఆ తర్వాత దూరం పెట్టడంతో వినూత్నంగా వేధింపులు...

వరుణ్
గురువారం, 25 జులై 2024 (08:21 IST)
ప్రేమకు వయసుతో పనిలేదు. రెండు మనసులు కలిస్తే చాలని ఓ మైనర్ నిరూపించాడు. తాను చదువుకునే టీచర్‌పై మనసు పారేసుకున్నాడు. అతని ప్రేమకు ఆ టీచరమ్మ కూడా సమ్మతించింది. దీంతో కొంతకాలం పాటు వారిద్దరూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత తాను తప్పు చేస్తున్నానని గ్రహించిన టీచర్... ఆ యువకుడుని దూరంగా పెట్టింది. దీంతో టీచర్‌‍పై కక్ష పెంచుకున్న మైనర్ వినూత్నపద్దతిలో వేధింపులకు పాలపడ్డాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 17 యేళ్ళ మైనర్ బాలుడు... 22 యేళ్ల మహిళా టీచర్ వద్దకు ప్రతి రోజూ టూషన్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ టీచర్‌ను మైనర్ బాలుడు ప్రేమించసాగాడు. అతని ప్రేమను గ్రహించిన ఆ టీచర్ కూడా సమ్మతం తెలిపింది. ఇద్దరూ కలిసి ఏకాంతంగా కలుసుకుంటూ వచ్చారు. అయితే, తాను తప్పు చేస్తున్నానని తెలుసుకున్న టీచర్.. ఆ బాలుడిని దూరం పెట్టింది. అప్పటి నుంచి వినూత్న పద్ధతిలో వేధింపులకు పాల్పడసాగాడు.
 
ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్‌లైన్ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్స్‌ బుక్ చేసి వేధించాడు. ఆ ఆర్డర్స్‌తో వచ్చేవారికి సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది. చివరకు ఎవరో గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఈ నెల 2న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నంబరు, ఈ మెయిల్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి.. రెండు సెల్‌ఫోన్లు, వైఫై రూటర్‌ను సీజ్ చేశారు. ఆ మైనరా బాలుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా... మానసిక ఆరోగ్యం గురించి కౌన్సెలింగ్ చేయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments