Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిసెకి ఏసీ.. అత్త కోసం అల్లుడి ఔదార్యం

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (16:30 IST)
ఇంటికి ఏసీ పెట్టించుకున్నారు అంటే.. కాస్తో, కూస్తో శ్రీమంతుల కుటుంబమే అనుకోవాలి. పల్లెటూర్లలో అయితే ఏసీ అనేది ఖచ్చితంగా లగ్జరీగా భావించే వ్యవహారమే. మాములుగా అయితే ఖరీదైన బంగళాలు, డాబాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పూరింట్లో మీరు ఎప్పుడైనా ఏసీ చూశారా? అయితే పైన ఫోటో చూడండి. 
 
ఇది ఎక్కడో జరిగింది కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ నగర్‌లో జరిగింది. కొన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మంచాన పడింది. దీంతో ఆమె నివశిస్తున్న గుడిసెకు హైటెక్ హంగులు అద్దాడు వృద్ధురాలి అల్లుడు. కూలర్‌ని ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఎండ వేడి పెరిగితే ఆవిడ ఇబ్బంది పడుతుందేమో.. ఏసీ కూడా పెట్టించాడు. దీంతో.. అత్త ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
ప్రస్తుత కాలంలో తల్లీదండ్రులనే పట్టించుకోని వారున్న లోకంలో.. అత్తకి బాగాలేదని ఆమె కోసం సకల సౌకర్యాలు కల్పించి.. గుడిసెకు ఏసీ ఏర్పాటు చేయడాన్ని చూసి కాలనీవాసులు సదరు అల్లుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments