Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాసా కాపాడు, తిరుమలలో చిరుతలు.. పాములు

Webdunia
గురువారం, 15 జులై 2021 (20:42 IST)
లాక్ డౌన్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఈమధ్యే భక్తుల రద్దీ కాస్త పెరుగుతోంది. అయితే భక్తుల సందడి లేకపోవడం.. తిరుమల నిర్మానుష్యంగా మారిపోవడం.. ఘాట్ రోడ్లలో వాహన రాకపోకలు తక్కువగా ఉండడంతో జంతువులు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి.
 
గత వారం చిరుత పులులు భక్తులకు కనిపించిన విషయం తెలిసిందే. రెండవ ఘాట్ రోడ్డులోని వినాయకుని గుడి దగ్గర చిరుత రోడ్డు దాటుతూ భక్తుల సెల్ ఫోన్‌కు దొరికింది. అలాగే  తిరుమలలోని సన్నిధానం సదన్-2 దగ్గర చిరుత ప్రత్యక్షమైంది. చిరుతపులుల తిరుగుతుండటంతో  భక్తులు భయాందోళనకు గురయ్యారు. 
 
అయితే తాజాగా పాములు కూడా భక్తులు తిరిగే ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. తిరుమలలోని జిఎన్‌సి టోల్ గేట్ వద్ద అతి పెద్ద నాగుపాము రోడ్డుపైకి వచ్చేయడంతో భక్తులు గుర్తించి టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన టిటిడికి చెందిన పాములు పట్టే భాస్కర్ అక్కడికి చేరుకున్నారు.
 
అయితే నాగుపాము బుస్సలు కొడుతూ అక్కడి నుంచి వేగంగా వెళుతూ కనిపించింది. దీంతో పాముల భాస్కర్ నాగుపామును పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి వదిలేశాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండే జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తుండటంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments