Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో స్మృతి ఇరానీ ట్వీట్... వైరల్ అయిన ట్వీట్

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (12:37 IST)
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలుగులో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా ఉత్తర భారతావనికి చెందిన స్మృతి ఇరానీ.. హిందీ లేదా ఇంగ్లీషులో ట్వీట్ చేస్తుంటారు. కానీ, ఈ దఫా తెలుగులో ట్వీట్ చేశారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు చేపట్టే వివిధ రకాల పథకాలకు మంచి ప్రాచూర్యం కల్పించే నిమిత్తం ఆమె ప్రాంతీయ భాషలను తన ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఇది ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షిస్తోంది. 
 
ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఇటీవల తెలుగులో ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'సమర్థ్' అనే పథకాన్ని తీసుకొచ్చిందని స్మృతీ ఇరానీ తెలిపారు.
 
ఇందులోభాగంగా ఏపీలోని 12,000 మంది యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వీరికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ కృషి చేస్తోందన్నారు. ఈ పథకాన్ని ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసిన స్మృతీ ఇరానీ, తన ట్వీట్‌కు ఓ వీడియో కూడా జతచేశారు. 

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments