Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ గారూ... మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు: నారా లోకేష్ ( ఆ కుందేలుకి మూడు కదూ)

జగన్ గారూ... మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు: నారా లోకేష్ ( ఆ కుందేలుకి మూడు కదూ)
, బుధవారం, 14 ఆగస్టు 2019 (19:26 IST)
ఏపీ మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఇలా ట్వీట్ చేశారు. 
 
వైఎస్ జగన్ గారు! ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర మంత్రి లేఖలు రాశారు, అయినా మీరు వినలేదు. హైకోర్టు సమీక్షలను వాయిదా వేసినా మీరు ఖాతరు చెయ్యలేదు. ఇప్పుడు విద్యుత్ పీపీఏలపై మీ సమీక్షలు పెట్టుబడులకు విఘాతమని జపాన్, భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. కనీసం ఇప్పుడైనా మీ నిర్ణయం మార్చుకుంటారా?
 
జగన్ గారు! ఆంధ్రప్రదేశ్‌కి ప్రపంచంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, మీ పిచ్చి నిర్ణయాలతో దాన్ని చెడగొట్టకండి. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టకండి. మీరు పట్టిన కుందేలుకి ఒకటే కాలు అనే ధోరణి వదలండి." అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐతే సామెతలో తేడా కనబడుతోంది... మీరు పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అని నెటిజన్లు మొదలుపెట్టేశారు మళ్లీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాత్రూంలో ఆమె కాలు జారింది... అలా మొదలైంది... కానీ స్నేహితుడు బలయ్యాడు...