Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకు నీతో గొడవపెట్టుకోవాలని ఉందక్కా.. సుష్మా మృతిపై స్మృతి ట్వీట్

నాకు నీతో గొడవపెట్టుకోవాలని ఉందక్కా.. సుష్మా మృతిపై స్మృతి ట్వీట్
, బుధవారం, 7 ఆగస్టు 2019 (13:52 IST)
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ మృతిపట్ల కేంద్ర మత్రి స్మృతి ఇరానీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. సుష్మా స్వరాజ్ మృతి చెందిన వార్త తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంట కన్నీరు కార్చారు. సుష్మా భౌతికకాయానికి నివాళులు అర్పిన స్మృతి ఇరానీ... ఓ ట్వీట్ చేస్తూ, సుష్మాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 
 
"అక్కా.. నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉందక్కా, బన్సూరీతో కలిసి నన్ను రెస్టారెంట్‌కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామీస్ నెరవేర్చకుండానే నువ్వు వెళ్లిపోయావు" అని ట్వీట్ చేశారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఏర్పాటైన బీజేపీ తొలి ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీలు కేంద్ర మంత్రులుగా పని చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, మరో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా తీవ్ర భావోద్వేగానికి గురై... కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సుష్మాస్వరాజ్ యావత్ తెలంగాణకు చిన్నమ్మ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె అందించిన సహకారాన్ని రాష్ట్ర ప్రజలు మరవలేరని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఆమె తపించేవారని... తమలాంటి వారికి ఆమె స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మల్లెల పద్మనాభరావు కు చంద్రబాబు నివాళి