Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల నుంచి భూములు సేకరించాలి : సీఎం జగన్

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (17:00 IST)
సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం రైతుల నుంచి భూములను సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ భూములు ఇచ్చేందుకు రైతులను ప్రోత్సహించి, వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
నంద్యాల జిల్లాలో  నిర్మించిన రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను సీఎం జగన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూమిలిచ్చే రైతులకు యేడాదికి రూ.30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామని తెలిపారు. 
 
ఈ మేరకు రైతులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుని, సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇస్తుందన్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం మేర లీజుధరను పెంచుతుందని తెలిపారు. 
 
ఒక్కో లొకేషన్‌లో కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూసేకరణ జరగాలని చెప్పారు. ఆ మేరకు రైతులు భూములు ఇచ్చేలా వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. ఈ గ్రీన్ గో ప్రాజెక్టుల నిర్మాణాలకు రైతులు కూడా సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments