Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి అయ్యన్నపాత్రుడును ఓడించిన పూరీ జగన్నాథ్ సోదరుడు

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా కేవలం ముగ్గురు మినహా 15 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. ఇలాంటివారిలో మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కూడా ఉన్నారు. ఈయన్ను ఓడించింది ఎవరో కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడైన మెట్ల ఉమాశంకర్ గణేశ్. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఈయన.. ఈ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
 
మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ ఎన్నికల్లో విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఇదే స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ పోటీ చేశారు. నిజానికి గణేశ్‌కు మంత్రి అయ్యన్నపాత్రుడు రాజకీయ గురువు. కానీ, రాజకీయాలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. 
 
ఈ ఎన్నికల్లో పూరీ సోదరుడుకు 90,077 ఓట్లు పోలుకాగా, అయ్యన్నపాత్రుడుకు 67,777 ఓట్లు వచ్చాయి. దీంతో మంత్రి అయ్యన్నపాత్రుడు తన శిష్యుడు చేతిలో ఓడిపోయాడు. గత ఎన్నికల్లో ఓడిపోయాడన్న సానుభూతితో పాటు.. జగన్ ఛరిష్మా కూడా ఆయనకు కలిసొచ్చి విజయభేరీ మోగించి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టనున్నరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments