Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై లోక్ సభలో ప్లకార్డుల‌తో నిర‌స‌న

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (15:09 IST)
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే, ఊరుకునేది లేద‌ని లోక్ స‌భ‌లో నిర‌స‌న తెలిపారు. విశాఖ ఎంపీ  ఎం. వి .వి. సత్యనారాయణతో స‌హా ఆంధ్ర ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన గళాన్ని సభాపతికి వినిపించారు. విశాఖ ఎంపీ ఎం. వి .వి సత్యనారాయణ "వైజాగ్ స్టీల్ ప్లాంట్- నాట్ ఫర్ సేల్" అంటూ తనదైన గళాన్ని వినిపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగధనుల ఆత్మార్పణ త్యాగ ఫలమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని, అటువంటి ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్ట దలచిన  కేంద్ర దుశ్చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నా అని తెలిపారు.

ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోలేని పక్షంలో, పార్టీ ఆదేశాల మేరకు తాము ఎంతవరకైనా వెళ్లి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేసేంత వరకు కృషి చేస్తామన్నారు. సభా కార్యక్రమాలు అడ్డుకున్న తరుణంలో,  స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్ సభను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments