Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం

19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం
, ఆదివారం, 18 జులై 2021 (12:25 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రేపు ఉద‌య‌దం 11 గంట‌ల‌కు పార్లమెంటు స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. సభ్యుల్లో అధిక శాతం మంది ఇప్ప‌టికే క‌రోనా టీకాలు తీసుకున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంటులో ప‌లు స‌మ‌స్య‌ల‌పై నిల‌దీసేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా, క‌రోనాతో పాటు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌లు, చైనాతో ప‌రిస్థితులు, దేశంలో నిరుద్యోగం, ఆర్థిక ప‌రిస్థితులు వంటి అంశాల‌పై కేంద్ర స‌ర్కారుని ప్ర‌శ్నించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకుంది.
 
సాగుచట్టాలపై రైతుల  ఉద్య‌మం, క‌రోనా ప‌రిస్థితులు, నిరుద్యోగం వంటి అంశాలు ఈ స‌మావేశాల్లో కీల‌కం కానున్నాయి. అలాగే, పెట్రో ఉత్పత్తుల ధరలపై ప్ర‌తిప‌క్షాలు గ‌ట్టిగా నిల‌దీసే అవ‌కాశం ఉంది.  
 
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం నేప‌థ్యంలో కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన‌ గెజిట్ నోటిఫికేష‌న్ అంశాన్ని లేవ‌నెత్తాల‌ని తెరాస నిర్ణ‌యించింది. అలాగే, విభ‌జన చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌ను ప్ర‌స్తావించాల‌ని వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది. 
 
పోల‌వ‌రం నిధులు, విశాఖ ఉక్కు అంశాల‌పై కూడా ప్ర‌శ్నించ‌నుంది. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి, రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల అంశాల‌ను లేవ‌నెత్తాల‌ని తెదేపా భావిస్తోంది. ఇదిలావుంటే, ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మళ్లీ 40 వేలు దాటిన పాజిటివ్ కేసులు