Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో కేసులో పోసానికి 14 రోజుల రిమాండ్ : కర్నూలు కోర్టు ఆదేశం

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (10:44 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కర్నూలు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
ఈ కేసులో పోసానిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని తమకు అప్పగించాలంటూ ఆదోనీ పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతి ఇవ్వడంతో పోసానిని మంగళవారం అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల తర్వాత కర్నూలు జిల్లా కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 
 
ఇరు పక్షాల వాదనలు ఆలకించిన తర్వాత పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18వ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు  తరలించారు. మరోవైపు, నరసరావు పేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. కాగా, పోసానిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదైవున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments