Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో కేసులో పోసానికి 14 రోజుల రిమాండ్ : కర్నూలు కోర్టు ఆదేశం

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (10:44 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కర్నూలు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
ఈ కేసులో పోసానిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని తమకు అప్పగించాలంటూ ఆదోనీ పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతి ఇవ్వడంతో పోసానిని మంగళవారం అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల తర్వాత కర్నూలు జిల్లా కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 
 
ఇరు పక్షాల వాదనలు ఆలకించిన తర్వాత పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18వ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు  తరలించారు. మరోవైపు, నరసరావు పేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. కాగా, పోసానిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదైవున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments